D E S C R I P T I O N
ఒకవైపు తన అల్లుడైన కంసుణ్ణి సంహరించాడనే కోపంతో మరోవైపు తన సామ్రాజ్య విస్తరణకు అడ్డుపడతాడనే భయంతో జరాసంధుడు మధురపై దాడి చేస్తే, మధురను రక్షించడానికి, పారుబోతు అని లోకం అపహసిస్తుందనే లేకుండా, సహ్యాద్రికి పారిపోయి తన వలయంలోకి జరాసంధుని రప్పించుకొని, పరాభవించి పంపడం కృష్ణబలరాములకే సాధ్యం – సృగాలవ వాసుదేవ వధ, ఆర్షధర్మ సంప్రదాయాలకు విరుద్దంగా రాచకన్నెలను రాజకీయ కుట్రలకు బిచేసే దుష్టవ్యూహాలను ఛేదించడం, విదేశీ రాక్షస మూకను తీసుకొని కాలయవనుడొక వైపు నుంచి వస్తుంటే, రెండోవైపు మధురా నాశనానికి జరాసంధుడు పూనుకుంటే, తన ప్రజలను మధుర నుండి పశ్చిమసముద్ర తటానికి – ద్వారకకు వలస నడిపించడం – తనను పారుబోతు అన్నా తన పరువుకన్నా, ధర్మరక్షణ, ప్రజారక్షణ మిన్న అనే భావంతో ఎదిరించి చివరకు రుక్మిణిని గాంధర్వవిధిని వివాహమాడడం ద్వితీయ భాగంలోని కథ. కర్తవ్యమే ధర్మం, కష్టనష్టాలు కాదు, బాధలు కాదు – “కురుకర్మ” అని సందేశమిచ్చే భాగం ఈ “రుక్మిణీహరణం”.
రుక్మిణీహరణం
Author: భండారు సదాశివరావు
Language: Telugu
Pages: 365
Topics: 49


